నేటి నుంచి విత్తనాల కోసం నమోదు చేసుకోండి
ABN , First Publish Date - 2021-05-17T05:01:31+05:30 IST
మండలంలో నేటి నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్యామ్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వీరపునాయునిపల్లె, మే 16: మండలంలో నేటి నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్యామ్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి 500 క్వింటాళ్ల రాయితీ కే6 రకం వేరుశనగ విత్తనాలు మంజూరయ్యాయని, రైతులు ఆధార్కార్డు, పట్టాదారు పాసుబుక్కులు జిరాక్స్తో పాటు సెల్ఫోన్ ఖచ్చితంగా తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 24వ తేది నుంచి విత్తన పంపిణీ ఉంటుందన్నారు.