పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలి
ABN , First Publish Date - 2022-05-24T07:15:04+05:30 IST
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల
ఒంగోలు (కార్పొరేషన్), 23 : రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నాటి టీడీపీ హయాంలో అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వైసీపీ పాలనలో పన్నుల భారంలో మొదటిస్థానంలో ఉన్నదని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల నుంచి దేశప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. గతేడాది చివరిలో దేశంలో అనేక రాష్ట్రాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయని, అయితే ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోవడంతో అదనపు పన్నుల భారం మరింత మోపుతున్నారన్నారు. రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం సుముఖంగా లేదని అన్నారు. పెట్రో బాదుడుతోపాటు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు. దీంతో సామాన్య మానవుడు జీవితం బతుకు భారంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలపై మోపిన పన్నులు, ధరల భారాన్ని తగ్గించాలని కోరారు.