‘రైతులకు మేలు కలే’
ABN , First Publish Date - 2020-10-02T09:16:08+05:30 IST
సీఎం జగన్ రైతులకు చేసే మేలు కలగానే మిగిలిందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు.
కొత్తపేట, అక్టోబరు 1: సీఎం జగన్ రైతులకు చేసే మేలు కలగానే మిగిలిందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు. గురువారం కొత్తపేటలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరిట కోట్లాది రూపాయల లెక్కలు చూపించి మోసం చేస్తుందన్నారు. రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి మంచిది కాదని, రైతుసంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడాలని ఆమె సూచించారు.