కరోనా కష్టకాలంలో రెడ్క్రాస్ సేవలు
ABN , First Publish Date - 2021-04-13T05:17:26+05:30 IST
కరొనో నియంత్రణకు రెడ్క్రాస్ ఆస్పత్రిద్వారా విలువైన సేవలు అందించినట్లు సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ పి.వేణుగోపాల్ తెలిపారు.
గవర్నర్కు వివరించిన జిల్లా చైర్మన్
40 వేల మందికి పరీక్షలు, 15 వేల మంది వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడి
విశాఖపట్నం, ఏప్రిల్ 12: కరొనో నియంత్రణకు రెడ్క్రాస్ ఆస్పత్రిద్వారా విలువైన సేవలు అందించినట్లు సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ పి.వేణుగోపాల్ తెలిపారు. రాజ్భవన్ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో 40 వేలమందికి కొవిడ్ పరీక్షలు, 15 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ వేణుగోపాలరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.