ఎర్రచందనం స్వాధీనం - స్మగ్లర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-07-03T04:45:54+05:30 IST

బాలపల్లె రేంజి పరిధి కంగిమడుగు బీటులో మర్రిమానుపెం ట వద్ద 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, స్మగ్లర్‌ అన్నాదురైని అరెస్టు చేసినట్లు బాలపల్లె రేంజర్‌ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

ఎర్రచందనం స్వాధీనం - స్మగ్లర్‌ అరెస్టు
ఎర్రచందనం దుంగలు, నిందితునితో అటవీ అధికారులు

రైల్వేకోడూరు, జూలై 2: బాలపల్లె రేంజి పరిధి కంగిమడుగు బీటులో మర్రిమానుపెం ట వద్ద 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, స్మగ్లర్‌ అన్నాదురైని అరెస్టు చేసినట్లు బాలపల్లె రేంజర్‌ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రాబడిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో అదుపులోకి తీసుకున్న నిందితుడు తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌గా గుర్తించామన్నారు. దుంగలు సహా రెండు గొడ్డళ్లు, రంపం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ విషయంలో నిందితులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో డిప్యూటీ డీఆర్‌ఓ ఎస్‌. చంద్రకళ, ఎఫ్‌బీఓ ఆర్‌. సుబ్బలక్షుమ్మ, ఎఫ్‌బీఓ ఎం. గౌసా తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T04:45:54+05:30 IST