టోల్‌ప్లాజా సేవలకు గుర్తింపు

ABN , First Publish Date - 2021-03-07T06:43:44+05:30 IST

వేంపాడు హైవే టోల్‌ప్లాజా చేపడుతున్న సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.

టోల్‌ప్లాజా సేవలకు గుర్తింపు
టోల్‌ప్లాజా సిబ్బంది సంబరాలు

నక్కపల్లి, మార్చి 6 : వేంపాడు హైవే టోల్‌ప్లాజా చేపడుతున్న సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. ఏపీ టోల్‌ప్లాజా ప్రాజెక్ట్స్‌ ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌లో భాగంగా చేపట్టిన సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం లభించినట్టు టోల్‌ప్లాజా మేనేజర్‌ పలివెల వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు మంత్రి విశ్వరూప్‌ శనివారం అమరావతిలో ప్రదానం చేశారన్నారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద యాజమాన్యం ఉద్యోగులు, కార్మికులు సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. ఇందులో పండూ నాయక్‌, రవి కొప్పుల  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T06:43:44+05:30 IST