హోమియో వైద్యానికి గుర్తింపు
ABN , First Publish Date - 2021-04-11T05:38:59+05:30 IST
ప్రస్తుతం హోమియో వైద్యానికి మంచి గుర్తింపు లభిస్తోందని పలువురు వక్తలు తెలిపారు.
కవిటి: ప్రస్తుతం హోమియో వైద్యానికి మంచి గుర్తింపు లభిస్తోందని పలువురు వక్తలు తెలిపారు. శనివారం జగతిలో హోమియోవైద్య పితామహుడు శామ్యూల్ హానిమన్ జయంతి నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలు హోమియో వైద్యంతో నయమవుతున్నాయని తెలిపారు. జగతిలో హానిమన్ విగ్రహం ఏర్పాటుచేసిన దివంగత సంజీవరావును గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా హోమియో వైద్యులు ఎన్.దాసు, సర్పంచ్ పి.వరప్రసాద్, మాజీ సర్పంచ్ పి.నేతాజీ హానిమన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హోమియో వైద్యులు అనురాధ, సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, గోవింద రెడ్డి గ్రామపెద్దలు బి.సీతారామ్మూర్తి, డి.బాబూరావు, పి.బాలయ్య, టి.హరి పాల్గొన్నారు.