వీడియో కాల్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ
ABN , First Publish Date - 2020-08-04T11:06:00+05:30 IST
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుంచి వీడియో కాల్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 3: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుంచి వీడియో కాల్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. కరోనా నేపథ్యంలో ఆర్డీవో శ్రీనివాసులు బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.