రీ కౌంటింగ్‌ జరపాలని ఈసీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-28T06:46:50+05:30 IST

తునికిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఓట్లను రీ వెరిఫికేషన్‌ విత్‌ సీరియల్‌ నంబర్‌, ఎలాంగ్‌ విత్‌ రీ కౌంటింగ్‌ జరపాలని టీడీపీ మద్దతుతో పోటీచేసిన సర్పంచ్‌ అభ్యర్థి వడ్డెబోయిన చిన మంగమ్మ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి, జాయింగ్‌ కలెక్టర్‌, నూజివీడు సబ్‌ కలెక్టర్‌, ఎంపీడీవో, తునికిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు.

రీ కౌంటింగ్‌ జరపాలని ఈసీకి ఫిర్యాదు

గంపలగూడెం : తునికిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఓట్లను రీ వెరిఫికేషన్‌ విత్‌ సీరియల్‌ నంబర్‌, ఎలాంగ్‌ విత్‌ రీ కౌంటింగ్‌ జరపాలని టీడీపీ మద్దతుతో పోటీచేసిన సర్పంచ్‌ అభ్యర్థి వడ్డెబోయిన చిన మంగమ్మ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి, జాయింగ్‌ కలెక్టర్‌, నూజివీడు సబ్‌ కలెక్టర్‌, ఎంపీడీవో, తునికిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తునికిపాడు గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ  నిలబడగా ఆర్వో నాకు ఉంగరం గుర్తును కేటాయించారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్‌ పేపర్ల కట్టలను తారుమారు చేసి 18 ఓట్ల తేడాతో నేను ఓడిపోయినట్లు ప్రకటించారు. రీ కౌంటింగ్‌ చేయాలని ఆర్వోను కోరగా పట్టించుకోలేదు. తునికిపాడులో 12 వార్డులు ఉండగా నా ప్యానల్‌కు చెందిన ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. కాబట్టి అవకతవకలు జరిగాయని, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి. రద్దు అయిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు తదితర వివరాలతో కూడిన స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్వో కోరినా ఇవ్వలేదు.  కాబట్టి  రీ వెరిఫికేషన్‌ విత్‌ సీరియల్‌ నంబర్‌, ఎలాంగ్‌ విత్‌ రీ కౌంటింగ్‌ జరపాలని ఫిర్యాదు చేసినట్టు చినమంగమ్మ తెలిపారు. 

Updated Date - 2021-02-28T06:46:50+05:30 IST