‘చుక్కల’ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం : ఆర్డీవో
ABN , First Publish Date - 2022-06-23T04:14:27+05:30 IST
చుక్కల భూముల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు కావలి ఆర్డీవో శీనానాయక్ బుధవారం తెలిపారు. ఈ విషయమై తహసీల్దారు కార్యాలయలో బుధవారం వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కలిగిరి, జూన్ 22: చుక్కల భూముల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు కావలి ఆర్డీవో శీనానాయక్ బుధవారం తెలిపారు. ఈ విషయమై తహసీల్దారు కార్యాలయలో బుధవారం వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలో చుక్కల భూములను పరిష్కరించాలని మొత్తం 213 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు సుమారు 50 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని వీఆర్వోలను ఆదేశించామన్నారు. అదేవిధగా ఓటీఎ్సపై ప్రత్యేక దృష్ట సారించి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. స్థానిక సచివాలయాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు బీ శివకృష్ణయ్య, డీటీ చెంచయ్య, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.