123పే’ యూపీఐ సేవలను ప్రారంభించిన ఆర్బీఐ గవర్నర్
ABN , First Publish Date - 2022-03-08T23:17:59+05:30 IST
123పే’ యూపీఐ సేవలను ప్రారంభించిన ఆర్బీఐ గవర్నర్
న్యూఢిల్లీ: ఒక కొత్త సేవను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ప్రారంభించారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 40 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ‘123పే’ యూపీఐ సేవలను ప్రారంభించారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని సాధారణ ఫోన్లలో పని చేసే వినియోగదారుల కోసం సేవలను ప్రారంభించారు. ఎఫ్వై22లో యూపీఐ వాల్యూమ్లు రూ.76 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 123పే వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు అనుమతిస్తుంది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన 24x7 హెల్ప్లైన్ను కూడా మంగళవారం ప్రారంభించారు.