నన్ను విడుదల చేయండి
ABN , First Publish Date - 2022-05-26T15:45:15+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో తనను విడుదల చేయాలంటూ ముద్దాయిల్లో ఒకరైన రవిచంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్కు లేఖ రాశారు. రాజీవ్ హత్యకేసులో
- సీఎంకు రాజీవ్ హత్యకేసు ముద్దాయి రవిచంద్రన్ లేఖ
పెరంబూర్(చెన్నై): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో తనను విడుదల చేయాలంటూ ముద్దాయిల్లో ఒకరైన రవిచంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్కు లేఖ రాశారు. రాజీవ్ హత్యకేసులో మదురై కేంద్ర కారాగారంలో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న రవిచంద్రన్కు 30 రోజులు పెరోల్ ఇవ్వాలని ఆయన తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నవంబరు 11న 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. అనంతరం ఆరుసార్లు పెరోల్ను పొడిగించిన ప్రభుత్వం, రెండు రోజుల క్రితం ఏడో సారి పెరోల్ పొడిగించింది. ప్రస్తుతం రవిచంద్రన్ తూత్తుకుడి జిల్లా విలాత్తికుళం సమీపంలో సూరప్పనాయకన్పట్టిలో తల్లి రాజేశ్వరితో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా పేరరివాలన్కు సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ క్రమంలో, ఈ కేసులో మిగిలిన వారిని విడుదల చేసేలా న్యాయనిపుణులతో ముఖ్యమంత్రి సంప్రదించి, తమను విడుదల చేయాలని రవిచంద్రన్ లేఖలో కోరారు.