రేషన్‌ లబ్ధిదారుల నిరీక్షణ

ABN , First Publish Date - 2020-11-30T05:19:54+05:30 IST

రేషన్‌ సరుకుల పంపిణీ గడువుని పౌరసరఫరాల శాఖ పొడిగించినా ఉపయోగం లేకుండా పోయింది.

రేషన్‌ లబ్ధిదారుల నిరీక్షణ

గడువు పొడిగించినా సర్వర్‌ మొరాయింపు 

గుంటూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకుల పంపిణీ గడువుని పౌరసరఫరాల శాఖ పొడిగించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆదివారం నగరంలో పలు రేషన్‌ దుకాణాల వద్ద ఈ-పోస్‌ సర్వర్‌ మొరాయించింది. సెలవుదినం కావడంతో ఈ విడత రేషన్‌ సరుకులు పొందలేకపోయిన వారు ఎంతో ఆశతో షాపుల వద్దకు వెళ్లగా సర్వర్‌ మొరాయించడంతో  ఆగ్రహానికి గురయ్యారు.  సరకులకు రెండుసార్లు వేలిముద్ర వేసే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. కనీసం సోమవారం అయినా సర్వర్‌ సక్రమంగా స్పందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-11-30T05:19:54+05:30 IST