వేడుకగా రథయాత్ర

ABN , First Publish Date - 2021-02-27T04:49:51+05:30 IST

లుగో రోజు శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, యువకులు హాజరయ్యారు. స్వామివారి రథాన్ని లాగారు. జై శ్రీరామ్‌ నినాదాలతో గ్రామం మార్మోగింది. రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. రెండు గంటల పాటు సాగింది. రామతీర్థంతో పాటు సీతారామునిపేట,

వేడుకగా రథయాత్ర
రామతీర్థంలో స్వామివారి రథయాత్ర




రామనామస్మరణతో మార్మోగిన రామతీర్థం

అధిక సంఖ్యలో హాజరైన భక్తులు

నెల్లిమర్ల, ఫిబ్రవరి 26: రామతీర్థం దేవస్థానంలో సీతారాముల రథయాత్ర శుక్రవారం రాత్రి వేడుకగా సాగింది. భీష్మ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, యువకులు హాజరయ్యారు. స్వామివారి రథాన్ని లాగారు. జై శ్రీరామ్‌ నినాదాలతో గ్రామం మార్మోగింది. రాత్రి  10 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. రెండు గంటల పాటు సాగింది. రామతీర్థంతో పాటు సీతారామునిపేట, గొర్లెపేట, కొత్తపేట, తంగుడుబిల్లి, దన్నానపేట, సతివాడ, సారిపల్లి , టి.అగ్రహారం గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ టి.సత్యమంగవేణి, ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌, గొడవర్తినరిసంహాచార్యులు, పవన్‌ కుమార్‌, పాణంగిపల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈవో ప్రసాదరావు పర్యవేక్షించారు. 



Updated Date - 2021-02-27T04:49:51+05:30 IST