రమణీయంగా మాళమల్లేశ్వరుని రథోత్సవం

ABN , First Publish Date - 2022-10-08T04:32:33+05:30 IST

దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలులో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం భారీ జన సందోహం మధ్య వైభవంగా జరిగింది.

రమణీయంగా మాళమల్లేశ్వరుని రథోత్సవం

హొళగుంద అక్టోబరు 7:  దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలులో భాగంగా శుక్రవారం రాత్రి  రథోత్సవం భారీ జన సందోహం మధ్య వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి   రుద్రాభిషేకం, బండార్చన, రథసంస్కారం, రథాంగహోమం చేశారు, సాయంత్రం బిలేహల్‌ గ్రామస్థులు మేటి కుంభంతో రావడంతో రథోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి.  మాళమల్లేశ్వర స్వామి వారి విగ్రహాలను రథంపై చేర్చి, రథాన్ని ఎదురు బసవన్న గుడి వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. రథోత్సవంలో గొరవయ్యల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సైలు అబ్దుల్‌ జహీర్‌, రామాంజులు, విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరగట్టు ఆలయ కమిటీ సభ్యులు వీరనాగప్ప, రాము నాయక్‌, రామయ్య, సోమప్ప, లక్ష్మణ్ణ, మంజు నాయక్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-08T04:32:33+05:30 IST