సందడిగా జగన్నాథుని రథయాత్ర

ABN , First Publish Date - 2022-07-02T06:26:15+05:30 IST

స్థానిక కేశవస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సందడిగా జగన్నాథుని రథయాత్ర
చోడవరంలో రథయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం


చోడవరం, జూలై 1: స్థానిక కేశవస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు సుదర్శన సీతారామాచార్యులు పూజలతో రథయాత్ర శ్రీకారం చుట్టారు. భక్తులు రథాన్ని లాగారు. ఈ సందర్భంగా రథయాత్రలో బాలికల చిడతల కోలాటం ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ పెద్దలు అలమండ ఈశ్వరరావు, ఇతర పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:26:15+05:30 IST