ధాన్యాన్ని తరలించాలని రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST
లారీల కొరత వల్ల ధాన్యం బస్తాలు అక్కడికక్కడ అలాగే ఉంటున్నాయని, దీంతో అకాల వర్షానికి ధాన్యం తడిస్తే తీవ్రం గా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా మా క్లూర్ మండలం ఒడ్యాట్పల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం మానిక్భండార్ చెక్క వద్ద నిజామాబాద్- ఆర్మూర్ రాస్తారోకోకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
మాక్లూర్, మే7: లారీల కొరత వల్ల ధాన్యం బస్తాలు అక్కడికక్కడ అలాగే ఉంటున్నాయని, దీంతో అకాల వర్షానికి ధాన్యం తడిస్తే తీవ్రం గా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా మా క్లూర్ మండలం ఒడ్యాట్పల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం మానిక్భండార్ చెక్క వద్ద నిజామాబాద్- ఆర్మూర్ రాస్తారోకోకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రాస్తారోకోను విరమించాలని కోరారు. ధాన్యాన్ని లార్లీల్లో రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేయగా వారు స్పందించక పోవడంతో మోటారు సైకిళ్లపై కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రం అందజేశారు.