తాగునీటి కోసం పాలమాకులలో రాస్తారోకో
ABN , First Publish Date - 2022-05-17T05:21:38+05:30 IST
నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో తాగునీరు రావడం లేదంటూ గ్రామస్థులు సిద్దిపేట-హన్మకొండ రహదారిలోని పాలమాకుల గ్రామ బస్టాండ్ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
నంగునూరు, మే 16: నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో తాగునీరు రావడం లేదంటూ గ్రామస్థులు సిద్దిపేట-హన్మకొండ రహదారిలోని పాలమాకుల గ్రామ బస్టాండ్ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 15 రోజుల నుంచి గ్రామంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీరురావడం లేదని చెప్పినా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామంలో ఉన్న బోరు మోటార్లు సైతం కాలిపోయినా వాటిని బాగుచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్పంచ్, ఎంపీటీసీ పట్టించుకొని నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.