భూ బదలాయింపు ఆపాలి

ABN , First Publish Date - 2020-11-29T05:19:05+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల కేటాయించవద్దని, ఈ భూమి బదలాయింపు జీవోను వెంటనే రద్దు చేయాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు హెచ్చరించారు.

భూ బదలాయింపు ఆపాలి

  నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల నిరసన



నంద్యాల, నవంబరు 28: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల కేటాయించవద్దని, ఈ భూమి బదలాయింపు జీవోను వెంటనే రద్దు చేయాలని  ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు హెచ్చరించారు. వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములు ఇవ్వొద్దని శనివారం కార్మికులు చెవ్విలో పూలు పెట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి ఏవీ రమణ అధ్యర్యంలో ఆందోళన జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 341ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్లకు విన్నవిస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు.  అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని నేరుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాధాన్యతను వివరించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:19:05+05:30 IST