జీవీఎంసీకి అరుదైన గుర్తింపు
ABN , First Publish Date - 2020-08-11T09:54:39+05:30 IST
స్మార్ట్సిటీ మిషన్లో జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచిన జీవీఎంసీ మరో అరుదైన గుర్తింపు దక్కించుకోబోతున్నది.
15న సోలార్ ప్రాజెక్టుపై నేషనల్ జియోగ్రఫిక్ చానల్లో ప్రసారం
విశాఖపట్నం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): స్మార్ట్సిటీ మిషన్లో జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచిన జీవీఎంసీ మరో అరుదైన గుర్తింపు దక్కించుకోబోతున్నది. ముడసర్లోవ రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే సోలార్ ప్యానల్స్(సోలార్ ఫ్లోటింగ్) దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. వినూత్నమైన ఈ ప్రాజెక్టుపై నేషనల్ జియోగ్రఫిక్ చానల్ ఈ నెల 15న సాయంత్రం ఆరు గంటకు ప్రత్యేక ప్రసారం చేయనున్నట్టు జీఎంఎంసీ స్మార్ట్సిటీ ప్రాజెక్టు ఎస్ఈ వినయ్కుమార్ తెలిపారు. ఇది జీవీఎంసీకి ఒక విధంగా అరుదైన గుర్తింపుగానే భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.