వేగవంతంగా క్రీడా మైదానాల ఏర్పాటు
ABN , First Publish Date - 2022-05-27T04:56:32+05:30 IST
వీలైనంత త్వరగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్(లోకల్బాడీ) ఆశీష్ సంగ్వాన్ అన్నారు.
మదనాపురం, మే 26: వీలైనంత త్వరగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్(లోకల్బాడీ) ఆశీష్ సంగ్వాన్ అన్నారు. గురువారం మండలంలోని కొన్నూరు, నెల్విడి గ్రామాల్లో క్రీడా మైదానాలను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ మండలంలో ఈనెల 30 వరకు రెండు గ్రామాల్లో ఎంపిక పూర్తి కావాలని, వాటిని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మిగతా గ్రామాల్లో కూడా ఎంపిక చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త శరత్రెడ్డి, డీఆర్డీఏ పీడీ నర్సింహులు, ఎంపీడీవో నాగేందర్, కొన్నూరు, నెల్విడి గ్రామ సర్పంచులు చుక్క జగన్, కోట్ల తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శులు రాజ కుమారి, భానుప్రకాష్, ఉప సర్పంచు రఘునాథ్రెడ్డి ఉన్నారు.