అత్యాచారం చేసాడంటూ యువతి ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-08-17T06:28:08+05:30 IST
వడ్లమూరుకు గ్రామానికి చెందిన మాకన రాజేష్ తనపై అత్యాచారం చేసాడంటూ సోమవారం అదే గ్రామానికి యువతి అంగర పోలీసులను ఆశ్రయించింది.
కపిలేశ్వరపురం, ఆగస్టు 16: వడ్లమూరుకు గ్రామానికి చెందిన మాకన రాజేష్ తనపై అత్యాచారం చేసాడంటూ సోమవారం అదే గ్రామానికి యువతి అంగర పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై అంగర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం..... విజయవాడలోని ఓల్డేజ్ హోమ్లో పనిచేస్తున్న తనను వడ్లమూరుకు చెందిన మాకన రాజేష్ ప్రేమించానని తరచూ వేధించేవాడని, తనకు ఇష్టం లేకున్నప్పటికీ డ్రింక్లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడని, గర్భం దాల్చగా అబార్షన్ చేయించుకోవాలని రాజేష్ బెదిరిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి ప్రస్తావన చేయగా అయిష్టాన్ని చూపుతున్నాడని, తన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ రాజేష్ బెదిరిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.