బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-08-11T07:15:27+05:30 IST

ప్రేమపేరుతో వంచించి బాలికపై అత్యాచారంచేసిన నిందితుడిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు కరప ఎస్‌ఐ డి.రమేష్‌బాబు తెలిపారు. వేళంగి గ్రామానికి చెందిన 17ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో చదువుతున్న సమయంలో ఆమె సీనియర్‌ అయిన సిరిపురం గ్రామానికి చెందిన కోరుమిల్లి కృష్ణతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.

బాలికపై అత్యాచారం

  • పోక్సో చట్టం కింద కేసు నమోదు

కరప, ఆగస్టు 10: ప్రేమపేరుతో వంచించి బాలికపై అత్యాచారంచేసిన నిందితుడిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు కరప ఎస్‌ఐ డి.రమేష్‌బాబు తెలిపారు. వేళంగి గ్రామానికి చెందిన 17ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో చదువుతున్న సమయంలో ఆమె సీనియర్‌ అయిన సిరిపురం గ్రామానికి చెందిన కోరుమిల్లి కృష్ణతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెనుంచి ఫోన్‌ నెంబర్‌ తీసుకుని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఈ క్రమంలో రెండుసార్లు కాకినాడలోని ఒక లాడ్జికి తీసుకెళ్లి పలుమార్లు శారీరక వాంఛను తీర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న కృష్ణ ఆమెతో గర్భనిరోధక మాత్రలను మింగించాడు. అది వికటించి తీవ్ర రక్తస్రావం, నొప్పి రావడంతో విషయాన్ని ఆమె తన తల్లి కి చెప్పింది. వెంటనే బాలికను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించి అక్కడినుంచి మెరుగైన చికిత్సకోసం ఈనెల 9న కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ఔట్‌పోస్టునుంచి వచ్చిన సమాచారంతో కరప పోలీసులు బాధితురాలి వద్దకు వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వివరించారు.


Updated Date - 2022-08-11T07:15:27+05:30 IST