Rangareddy: మాస్క్లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
ABN , First Publish Date - 2022-01-03T19:26:16+05:30 IST
జిల్లాలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాస్క్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాస్క్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాజేంద్రనగర్లో కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. ఇకపై హోటల్స్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకొని ఉండాలని సూచించారు. బయటి తిరుగేటప్పుడు మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఆఫీస్లు, దుకాణాలు ముందు మాస్కు పెట్టుకోవాలని బోర్డును ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. ఇప్పటి వరకు మాస్క్ పెట్టుకొని వారిపై 15 కేసులు నమోదు అయ్యాయి.