రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-12-20T16:32:53+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది.

రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్ద  ఔటర్ రింగ్ రోడ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-20T16:32:53+05:30 IST