ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-10-19T06:01:02+05:30 IST

హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ నిర్వహించారు.

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి
ఈవీఎంల ర్యాండమైజేషన్‌ నిర్వహిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన, తనిఖీ ఇదివరకే పూర్తి చేశామని, ప్రస్తుతం 469 బ్యాలట్‌ యూనిట్లు, 85 వీవీ ప్యాట్లను హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి అప్పగిస్తామని తెలిపారు. ఈ నెల 19న మంగళవారం ఉదయం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల గోదాం నుంచి బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను హుజూరాబాద్‌కు పంపిస్తామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కళ్యాడపు ఆగయ్య, జి శ్రీనివాస్‌ రెడ్డి, జానపట్ల స్వామి, పద్మాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-19T06:01:02+05:30 IST