ఊపందుకున్న ఖర్జూరం విక్రయాలు
ABN , First Publish Date - 2022-04-07T15:10:01+05:30 IST
రంజాన్ పండుగను పురస్కరించుకొని గల్ఫ్ దేశాల నుంచి పలు రకాల ఖర్జూరపు పండ్లు దిగుమతవుతున్నాయి. ఉపవాసదీక్ష చేస్తున్న ముస్లింల కొనుగోళ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి.
పెరంబూర్(చెన్నై): రంజాన్ పండుగను పురస్కరించుకొని గల్ఫ్ దేశాల నుంచి పలు రకాల ఖర్జూరపు పండ్లు దిగుమతవుతున్నాయి. ఉపవాసదీక్ష చేస్తున్న ముస్లింల కొనుగోళ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి. రంజాన్ సందర్భంగా ముస్లింలంతా నెలరోజుల పాటు ఉపవాసదీక్షలు చేపడుతుంటారు. దీక్షల సందర్భంగా అధిక పోషకాలందించే ఖర్జూరపు పండ్లను వారు ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రస్తుతం చెన్నై, కోవై సహా పలు నగరాలకు అల్జీరియా, ఇరాన్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి పలు రకాల ఖర్జురపు పండ్లు దిగుమతయ్యాయి. దీక్ష ఉండే వారికి గిఫ్ట్గా అందించేలా ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సరైన వ్యాపారం లేదని, ప్రస్తుతం విక్రయాలు పెరిగాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.