Modiకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు Jagan మద్దతు ఇవ్వాలి: Ramakrishna
ABN , First Publish Date - 2022-06-16T18:47:32+05:30 IST
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీడీపీ, వైసీపీ తమ వైఖరి స్పష్టం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Vijayawada: రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయని, ఏపీలో ఉన్న టీడీపీ (TDP), వైసీపీ (YCP)ల వైఖరి స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశంలో లౌకిక వాదానికి పెను ప్రమాదం సంభవించిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోదీ (Modi) పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ (Jagan) మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారని, 2014 ఎన్నికలలో ఓడినప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్ అవసరం మోదీకి ఉందని, ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తానని జగన్ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్... ఇప్పుడు నోరెందుకు విప్పడంలేదని రామకృష్ణ ప్రశ్నించారు.