జాతీయ జెండాతో ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-09T05:20:26+05:30 IST
పిరిడి జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం 150 అడుగుల జాతీయ జెండాతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
పిరిడి గ్రామంలో ఆకట్టుకున్న విద్యార్థులు
బొబ్బిలి, ఆగస్టు 8: పిరిడి జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం 150 అడుగుల జాతీయ జెండాతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీ ఆద్యంతం దేశభక్తి ఉట్టిపడేలా నినాదాలు చేశారు. హెచ్ఎం బి.శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హర్ఘర్ తిరంగా పైనా ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ టి.వరలక్ష్మి, ఉపాధ్యాయులు సీహెచ్జె ప్రవీణ్కుమార్, సత్యనారాయణ, జగన్నాథరావు, శివున్నాయుడు, సీతంనాయుడు పాల్గొన్నారు. ఇదే విధంగా నారసింహునిపేట హైస్కూలులో విద్యార్థులకు అమృత్మహోత్సవ్లో భాగంగా సోమవారం పెయింటింగ్, డిబేటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.