300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-15T04:39:35+05:30 IST
కలికిరి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
కలికిరి, ఆగస్టు 14: కలికిరి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 300 అడుగుల పొడవైన జాతీయ జెండాతో జరిగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, స్థానిక పోలీసులతో కలిసి జాతీయ పతాకాలతో ర్యాలీ జరిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండు నుంచి గాంధీ కూడలి వద్దకు వెళ్లి గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ అంజలీదేవి, ఎన్ఎ్సఎ్స కోఆర్డినేటర్ గులాబ్జాన్, అధ్యాపకులు మాధవి, స్వర్ణలత, రేణుకాదేవి, శివానంద ప్రదీప్, లిఖిత, హాజీరా, శ్రీరాములు, శైలజ, అనూష, రమణ, సురేంద్ర, స్థానిక పోలీసులు, విద్యార్థినులు పాల్గొన్నారు.