రాఖీ పండగను ఆనందంగా జరుపుకోవాలి
ABN , First Publish Date - 2022-08-12T05:00:21+05:30 IST
రాఖీ పండగ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి,
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 11 : రాఖీ పండగ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు రాఖీ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా.. ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండగ విశిష్టత అని, అక్కాచెల్లెళ్ల రక్ష తమ గురుతర బాధ్యత అనే కర్తవ్యాన్ని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని తెలిపారు.