రాజ్యసభలో గురువారం నాటి ఘటనలు బాధించాయి: చైర్మన్ వెంకయ్య
ABN , First Publish Date - 2021-07-23T18:36:37+05:30 IST
రాజ్యసభలో గురువారం చోటుచేసుకున్న ఘటనల పట్ల చైర్మన్ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు
న్యూఢిల్లీ: రాజ్యసభలో గురువారం చోటుచేసుకున్న ఘటనల పట్ల చైర్మన్ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన నుంచి పత్రాలను లాక్కొని ముక్కలు ముక్కలుగా చేయడం ద్వారా సభా కార్యకలాపాలను కొత్త స్థాయికి చేర్చారని వ్యాఖ్యానించారు. తనను చాలా బాధించిందన్నారు. ఇటువంటి చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. పత్రాలను చించిన టీఎంసీ ఎంపీ శంతను సేన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.