వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-16T05:55:38+05:30 IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిలోని నెమలిపురి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది

వాహనం ఢీకొని యువకుడి మృతి

రాజుపాలెం, మే15: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిలోని నెమలిపురి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోటనెమలిపురి గ్రామానికి చెందిన వర్ల యేసుదానం(34) పొక్లెయినర్లకు ఆయిల్‌ పోయటం వంటి పనులు చేసి జీవనం కొనసాగిస్తుంటాడు. రోజులాగానే నెమలిపురి పెట్రోల్‌ బంకువద్దకు వెళ్లిన యేసుదానం ఆయిల్‌ పట్టుకొని రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొని మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అమీర్‌ కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-16T05:55:38+05:30 IST