''కోవిడ్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ కోలుకుంటున్నారు''

ABN , First Publish Date - 2022-01-12T02:02:16+05:30 IST

''కోవిడ్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ కోలుకుంటున్నారు''

''కోవిడ్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ కోలుకుంటున్నారు''

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నట్లు అధికారులు మంగళవారం పేర్కొన్నారు. జనవరి 11న న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను వైద్యుల బృందం పరీక్షించింది. తేలికపాటి కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలతో మంత్రి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యుల బృందం పేర్కొంది. ప్రస్తుతం రాజ్‌నాథ్ సింగ్ కోలుకుంటున్నారని అధికారులు చెప్పారు. సోమవారం రోజు తాను స్వల్ప లక్షణాలతో కోవిడ్ బారినపడినట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-12T02:02:16+05:30 IST