రాజీవ్ సేవలు మరువలేనివి : ఉత్తమ్
ABN , First Publish Date - 2020-05-22T10:43:09+05:30 IST
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్
బేగంపేట/ముషీరాబాద్/బౌద్ధనగర్/చిక్కడపల్లి/అల్వాల్/రాజేంద్రనగర్/ఎల్బీనగర్/సరూర్నగర్/ఉప్పల్, మే 21 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడ చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ప్రముఖులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, సంపత్తో పాటు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాజీవ్గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ ముషీరాబాద్ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి టి.రాజేశ్వర్రావు శివాలయం చౌరస్తా వద్ద రాజీవ్గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జీఎన్.చారి, కన్వీనర్ రామకృష్ణ ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బిజ్జి శత్రు ఆధ్వర్యంలో పార్శిగుట్టలో జరిగిన రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు, సాయి పాల్గొన్నారు. సీతాఫల్మండిలో ఏఐసీసీ జాయింట్ కో-ఆర్డినేటర్ కృష్ణకుమార్గౌడ్, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు విజయ్ జవహర్, బీసీ సెల్ నాయకులు నారాయణగౌడ్, హన్మంతరావు, ఎన్ఎ్సయూఐ నాయకులు సుమంత్గౌడ్ రాజీవ్గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
అల్వాల్లో...
అల్వాల్లోని రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్, పవన్, వీసన్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉడంగడ్డ దళితబస్తీలో కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎ.సదాలక్ష్మి ఆధ్వర్యంలో రాజీవ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్ ఎన్టీఆర్నగర్లో రాజీవ్గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, యువజన నాయకులు ఉపేందర్ రెడ్డి, ఆర్కేపురం అధ్యక్షుడు గణేష్ నివాళులర్పించారు.
దిల్సుఖ్నగర్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి వీఎ్సఎన్ శ్రీనివా్సరావు, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఎల్బీనగర్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, రాజశేఖర్రెడ్డి, యువజన కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు. బాలాపూర్ కాంగ్రెస్ కార్పొరేటర్ ప్రభాకర్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య, యూత్ కాంగ్రెస్ బడంగ్పేట్ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి రాజీవ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ మీర్పేట్ అధ్యక్షుడు గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ వర్ధంతి నిర్వహించారు. రామంతాపూర్లో యువజన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా రోజువారీ కూలీలకు రూ.200 చొప్పున అందించారు.
కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ శివారెడ్డి, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రకళ శంకర్, నాయకురాలు కవిత ఆధ్వర్యంలో గాంధీనగర్లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్యాదవ్ ప్రారంభించారు. పార్టీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు శంకర్, లక్ష్మణ్, నవీన్, సురే్షయాదవ్ పాల్గొన్నారు