జూన్లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం
ABN , First Publish Date - 2022-05-21T06:09:02+05:30 IST
మండలంలోని ఎల్లారెడ్డిగూడెం శివారులోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లీటౌన్ షిప్లో ఓపెన్ ప్లాట్లు, గృహాలను రెండో విడత వేలం వేయనున్నట్లు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నార్కట్పల్లి, మే 20: మండలంలోని ఎల్లారెడ్డిగూడెం శివారులోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లీటౌన్ షిప్లో ఓపెన్ ప్లాట్లు, గృహాలను రెండో విడత వేలం వేయనున్నట్లు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు భౌతిక వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. 253 ఓపెన్ ప్లాట్లు, 363 వివిధ కేటగిరీల్లోని గృహాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. ఓపెన్ ప్లాట్ కనీస ధర గజం రూ.7,000, గృహాలకు రూ.12,000గా నిర్ధారించినట్టు పేర్కొన్నారు.