రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

ABN , First Publish Date - 2022-04-20T00:02:57+05:30 IST

జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 9 మంది చనిపోయారు.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 9 మంది చనిపోయారు. 9 మంది గాయపడ్డారు. ఝుంఝునూ ప్రాంతంలో ట్రక్కు.. ట్రాలీని ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో కన్నుమూశారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులు ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.





ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబీకులకు 2 లక్షల రూపాయల చొప్పున,  గాయపడినవారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించారు. 

Updated Date - 2022-04-20T00:02:57+05:30 IST