రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-24T15:41:24+05:30 IST

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన 48 గంటల దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా దీక్షకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలు మండలాల్లో నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. 


ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం చింతలపల్లిలో రేవంత్ దళిత గౌరవ ఆత్మ గౌరవ దీక్ష ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు దీక్ష జరుగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి దీక్షను విరమించనున్నారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చోనున్నారు. టీపీసీసీ ముఖ్యనాయకులు దీక్షకు హాజరుకానున్నారు. 


Updated Date - 2021-08-24T15:41:24+05:30 IST