చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2021-02-25T05:14:50+05:30 IST
చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశించారు. ఎన్డీపీఎస్, ఎంఎండీఆర్ చట్టాలపై సెబీ ఆధ్వర్యంలో పోలీసులకు, సెబీ సిబ్బందికి బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎస్పీ అమిత్బర్దర్
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 24 : చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశించారు. ఎన్డీపీఎస్, ఎంఎండీఆర్ చట్టాలపై సెబీ ఆధ్వర్యంలో పోలీసులకు, సెబీ సిబ్బందికి బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇసుక అక్రమ రవాణా చట్టాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల్లో పనితీరు కనబరిచిన 30 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేసి అభినందించారు. సమావేశంలో సెబీ ఏఎస్పీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, మైనింగ్ విభాగం ఏడీ హరికుమార్నాయుడు, ఏపీపీ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.