తిరుమలలో వర్షం
ABN , First Publish Date - 2022-05-27T07:21:42+05:30 IST
తిరుమలలో గురువారం గంట పాటు వర్షం కురిసింది.
తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం గంట పాటు వర్షం కురిసింది. మఽధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్డు, కాటేజీలు తడిచిముద్దయ్యాయి. మరోవైపు పాపవినాశనంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రదేశాల్లో చెట్లు నేలకూలగా, కొమ్మలు విరిగిపడ్డాయి. హఠాత్తుగా కురిసిన వర్షానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం ఆగాక తిరుమల కొండ చల్లబడింది.