వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2020-09-18T06:25:12+05:30 IST

మేడ్చల్‌, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు

వర్ష బీభత్సం

మేడ్చల్‌, వికారాబాద్‌ :  మేడ్చల్‌, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కాలువలు జలకళను సంతరించుకున్నాయి. అలుగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి డ్రైనేజీలు నిండి పలు ఇళ్లలోకి మురుగునీరు చేరింది. పలుచోట్ల పిడుగులు పడటంతో విద్యుత్‌ పరికరాలు కాలిపోయాయి. కంది, పత్తి పంటలు నీట మునగడంతో రైతులకు నష్టం వాటిల్లింది. 

Updated Date - 2020-09-18T06:25:12+05:30 IST