రైల్వేస్టేషన్‌లో నేటి నుంచి ప్రయాణికుల సందడి

ABN , First Publish Date - 2020-06-01T10:59:45+05:30 IST

తిరుపతి రైల్వేస్టేషన్‌లో సోమవారం నుంచి ప్రయాణికుల సందడి నెలకొననుంది

రైల్వేస్టేషన్‌లో నేటి నుంచి ప్రయాణికుల సందడి

తిరుపతి (ఆటోనగర్‌), మే 31: తిరుపతి రైల్వేస్టేషన్‌లో సోమవారం నుంచి ప్రయాణికుల సందడి నెలకొననుంది. తిరుపతి- నిజామాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు నడుపుకోవడానికి అనుమతిచ్చింది. సాయంత్రం 4.25 గంటలకు బయల్దేరే ఈ రైలెక్కే ప్రయాణికుల కోసం ఆదివారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను స్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మ, సీసీఐ పరమేశ్వరరాజు, స్టేషన్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌, జయంత్‌కుమార్‌, ఎలియా, ఐపీఎఫ్‌ సైదయ్య, రైల్వే భద్రత దళాల అధికారి శ్రీనివాస్‌ కూడా పర్యవేక్షించారు. కాగా.. రైళ్ల ఆపరేటింగ్‌లో 36 ఏళ్లపాటు పనిచేసి పదవీ విరమణ పొందిన రామచంద్రుడిని స్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మ, మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు సన్మానించారు. 

Updated Date - 2020-06-01T10:59:45+05:30 IST