రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్ల ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-23T10:59:36+05:30 IST

పట్టణ ప్రగతి, పురపా లక సుందరీకరణలో భాగంగా రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ రోల్‌ లైట్లను ఏర్పాటు చేశామ ని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు

రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్ల ప్రారంభం

ఏసీసీ, అక్టోబరు 22 : పట్టణ ప్రగతి, పురపా లక సుందరీకరణలో భాగంగా  రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ రోల్‌ లైట్లను ఏర్పాటు చేశామ ని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. గురు వారం ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి రైల్వే ఓవర్‌బ్రిడ్జి ఇరువైపుల లక్షా 80 వేల వ్యయంతో 32 స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ రోప్‌ లైట్లు ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వాహనచోద కులు, ప్రజల సౌకర్యార్థం లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టడం జరిగిం దన్నారు. ఇప్పటి వరకు బస్టాండ్‌, పాత మంచిర్యాల ప్రాంతాల్లో ఈ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మిగి లిన ప్రాంతాల్లో కూడా దీపావళి వరకు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్‌ చైర్మ న్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌,  సత్యం, విజిత్‌రావు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T10:59:36+05:30 IST