అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి: టీడీపీ
ABN , First Publish Date - 2020-07-12T10:27:21+05:30 IST
మండలంలోని హలహర్వి గ్రామంలో అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకుడు, ఎల్లెల్సీ డెరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి శనివారం కోరారు.
నందవరం, జూలై 11: మండలంలోని హలహర్వి గ్రామంలో అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకుడు, ఎల్లెల్సీ డెరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి శనివారం కోరారు. ఐదు నెలలుగా అధికారులు సర్వే చేసి 5 జాబితాలు ఇచ్చారని, ఈ నెల 5న తుదిజాబితా ఇచ్చి అధార్, ఫోటోలు తీసుకురావాలని సూచించారని అన్నారు. తహసీల్దారును కలవగా విచారించి లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని తహసీల్దారు హామీ ఇచ్చినిట్లు తెలిపారు. 30 ఏళ్లగా వామిదొడ్లు వేసుకున్నవారు తీసివేయాలని, పట్టాలు ఇస్తామని అధికారులు హమీ ఇచ్చినట్లు తెలిపారు. మరో 250మందికి మట్టాలు ఇచ్చి, న్యాయం చేయకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.