రైతులకు మద్దతిస్తే దాడులా?: రాహుల్‌

ABN , First Publish Date - 2021-03-05T11:45:22+05:30 IST

రైతుల ఆందోళనకు మద్దతు పలికిన బాలీవుడ్‌ ప్రముఖులు తాప్సీ పన్ను, అనురాగ్‌ కశ్య్‌పల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ

రైతులకు మద్దతిస్తే దాడులా?: రాహుల్‌

న్యూఢిల్లీ, మార్చి 4: రైతుల ఆందోళనకు మద్దతు పలికిన బాలీవుడ్‌ ప్రముఖులు తాప్సీ పన్ను, అనురాగ్‌ కశ్య్‌పల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. ‘మోదీ రైడ్స్‌ ప్రో ఫార్మర్స్‌(రైతులకు అండగా నిలిచిన వారిపై మోదీ దాడులు) అనే హష్‌ట్యాగ్‌తో మోదీ ప్రభుత్వ తీరును హిందీ సామెతలతో తప్పుబట్టారు. హిందీ సామేతలతో ఎద్దేవా చేశారు. అయితే, బాలీవుడ్‌ ప్రముఖులపై ఐటీ దాడులను బీజేపీ నేతలు సమర్ధించుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై దర్యాప్తు సంస్థలు చర్య తీసుకుంటాయని బీజేపీ ప్రతినిధి గౌరవ్‌ భాటియా తెలిపారు. దేశ విద్రోహ చర్యలకు పాల్పడిన సుధా భరద్వాజ్‌, షెర్జిల్‌ ఇమామ్‌, ఉమర్‌ ఖాలీద్‌ జైల్లో మగ్గుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Updated Date - 2021-03-05T11:45:22+05:30 IST