ఆలయాల నిర్మాణంలో రఘువీరా బిజీ
ABN , First Publish Date - 2020-08-11T11:44:57+05:30 IST
మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ స్వగ్రామంలో ఆలయాల నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.
మడకశిర రూరల్, ఆగస్టు 10: మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ స్వగ్రామంలో ఆలయాల నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. గత రెండేళ్లుగా ఆయన గ్రామంలో దాదాపు ఐదు దేవాలయాలు నిర్మించారు. వాటి నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. సోమవారం రఘువీరారెడ్డి దంపతులు స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు.