పరిసరాల శుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2020-12-06T04:20:47+05:30 IST

పరిసరాల పరిశుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు రాచూరి వెంకటేశం అన్నారు.

పరిసరాల శుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలి
ఫ్లాగ్‌రన్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న రాచూరి వెంకటేశం పాల్గొన్న యువజనసంఘాలు

నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు వెంకటేశం

గుంటూరు(తూర్పు), డిసెంబరు 5: పరిసరాల పరిశుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు రాచూరి వెంకటేశం అన్నారు. శనివారం నెహ్రూ యువ కేంద్రం ఆవరణలో యువజన సంఘాలతో స్వచ్ఛత, ఫ్లాగ్‌రన్‌ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ యువత సమూహంగా ఏర్పడి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  అనంతరం స్వచ్ఛత ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యువకేంద్రం డీడీ విజయారావు, సమయ్వయకర్త దేవిరెడ్డి కిరణ్మయి, నేషనల్‌  గ్రీన్‌కోర్‌ ఆర్గనైజేషన్‌ జిల్లాకో ఆర్డినేటర్‌ తిరుపతిరెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ స్వయం ఉపాధి సంస్థ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:20:47+05:30 IST