Qatar Airways ఢిల్లీ-దోహా విమానంలో పొగ...పాక్కు దారి మళ్లింపు
ABN , First Publish Date - 2022-03-21T16:57:59+05:30 IST
ఢిల్లీ నుంచి దోహా నగరానికి వెళుతున్న ఖతార్ ఎయిర్వేస్ ప్యాసింజర్ విమానంలో సోమవారం పొగ రావడంతో దాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీకి మళ్లించారు....
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దోహా నగరానికి వెళుతున్న ఖతార్ ఎయిర్వేస్ ప్యాసింజర్ విమానంలో సోమవారం పొగ రావడంతో దాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీకి మళ్లించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఖతార్ విమానం కార్గో ప్రాంతంలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అత్యవసరంగా ఈ ఖతార్ విమానాన్ని కరాచీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను అత్యవసరంగా మెట్లను ఉపయోగించి కిందకు దించామని ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. కరాచీ నుంచి దోహాకు ప్రయాణికులను తరలించడానికి రిలీఫ్ ఫ్లైట్ ఏర్పాటు చేశామని ఎయిర్ లైన్స్ తెలిపింది.
తమ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఖతార్ ఎయిర్ వేస్ క్షమాపణలు చెప్పింది. మార్చి 21వతేదీన ఢిల్లీ నుంచి దోహాకు వెళ్లాల్సిన క్యూఆర్579 విమానం కార్గో హోల్డ్లో పొగలు కనిపించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించి కరాచీకి మళ్లించామని ఖతార్ ఎయిర్వేస్ వివరించింది.