పబ్జీ పిచ్చితో సొంత కుటుంబాన్నే కాల్చేశాడు
ABN , First Publish Date - 2022-01-29T08:41:08+05:30 IST
పబ్జీ మైకంలో పడిన ఓ మైనర్ తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడు. పాకిస్థాన్లోని లాహోర్లో నహీద్ ముబారక్ (45), ఆమె తనయుడు తైమూర్(22), ఇద్దరు కుమార్తెలు (17, 11) కొన్ని రోజుల క్రితం వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ..
లాహోర్, జనవరి 28: పబ్జీ మైకంలో పడిన ఓ మైనర్ తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడు. పాకిస్థాన్లోని లాహోర్లో నహీద్ ముబారక్ (45), ఆమె తనయుడు తైమూర్(22), ఇద్దరు కుమార్తెలు (17, 11) కొన్ని రోజుల క్రితం వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. నహీద్ చిన్న కుమారుడు(14) మాత్రమే బతికిబట్టకట్టాడు. వారెలా చనిపోయారో తనకు తెలియదని బుకాయించిన బాలుడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 24 గంటలూ పబ్జీ ఆటలోనే ఉన్న బాలుడిలో మానసిక సమస్యలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. చదువుపై దృష్టి పెట్టడంలేదని తిట్టిన తల్లిని నిందితుడు ఆమె తుపాకీతోనే కాల్చాడు. నిద్రలో ఉన్న సోదరుడు, ఇద్దరు అక్కలను కూడా కాల్చి చంపాడు.