ఇన్ని రోజులు ఒకటి.. ఇక నుంచి మరోలా ఉంటది: మంత్రి Puvvada
ABN , First Publish Date - 2022-07-18T18:30:27+05:30 IST
రాష్ట్రంలో భారీ వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నామని మంత్రి పువ్వాడ అన్నారు.
హైదరాబాద్ (Hyderabad): రాష్ట్రంలో భారీ వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియా (Media)తో చిట్ చాట్ (Chit chat)గా మాట్లాడుతూ ఇన్ని రోజులు ఒకటి.. ఇక నుంచి మరోలా ఉంటదని అన్నారు. అసలైన పని ఇప్పుడే... మొదలైందన్నారు. నీళ్లు, కరెంట్, దొంగల భయం ఎన్ని సమస్యలు ఉన్నాయోనని అన్నారు. బురద, పాములు, తేళ్లు సమస్యలు ఎక్కువగా ఉంటాయని, సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా వరద బాధితులకు రేషన్ బియ్యం, రూ. 10 వేలు ఇస్తానని చెప్పారన్నారు. రూ. 10 వేల పంపకం జీహెచ్ఎంసీ తరహాలో కాకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు అండగా ఉంటామని.. ప్రజలతోనే ఉంటామని... మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.